నేనిప్పుడు
అలల్ని అదిమి
కలల్ని పొదిమి
కవిత్వాక్షరాలై అమరినవాన్ని
నేనిప్పుడు
కోట గోడలపై
ఏటి తడల పై
గడ్డిపువ్వై పూచినవాన్ని
నేనిప్పుడు
కారుమబ్బుల శూన్యంలో
కికరారణ్యంలో
వెలుగు కిరణమై మెరిసినవాన్ని
నేనిప్పుడు
నేర్రలు వారిన బీళ్ళపై
నానాటికి అడుగంటిపోతున్న నీళ్ళపై
కన్నీటి బిందువై కురిసినవాన్ని
నేనిప్పుడు
కాలం తప్పినా కార్తేపై
ఖాళీఅవుతున్న ఊళ్ళపై
కలత చెందుతున్నవాన్ని
నేనిప్పుడు
బారికేడ్ల పై
బాష్పవాయు గోళలపై
నెత్తుటి చారికలై మిగిలినవాన్ని
నేనిప్పుడు
అమరుల త్యాగాలపై
ఆత్మగౌరవ పోరాటాలపై
ఆర్తిగా రాలిన పూలవానని
నేనిప్పుడు
పరాయి పాలనపై
పక్షపాత వైకరిపై
ఫిరంగై పేలినవాన్ని
నేనిప్పుడు
నిరంకుశత్వపు ప్రభుత్వం పై
నిర్లక్ష్యపు నాయకత్వం పై
నినదించిన ప్రజా గొంతుకని
నేనిప్పుడు
మతోన్మాద ముర్ఖులపై
సామాజిక బాధ్యత మరచిన సంస్కార హీనులపై
సమరశంఖరావమై మ్రోగినవాన్ని
నేనిప్పుడు
వలస బతుకుల వెతలను
వాలిన పొద్దుపొడుపు కథలను
వర్ణచిత్రంగా మలిచే కుంచెను
నేనిప్పుడు
మరణ మృదంగం
మోగిస్తున్న మహమ్మారిపై
మానవత్వం
మరిచిన సమాజం పై
మ్రోగిన
యుద్దబేరిని
అప్పటికి , ఇప్పటికి
నేనెప్పుటికి
పదమై పలవరించి
కలమై కలవరించి
కవిత్వమై కదిలిపోయేవాన్ని
అక్షర చరిత్రనై నిలిచిపోయేవాన్ని.
రచన
సతీష్ కుమార్ బొట్ల
బొట్లవనపర్తి
9985960614