Tuesday 30 April 2013

బౌతిక చరిత్ర



ఎ చరిత్ర చుసిన ఏముంది గర్వకారణం
అని మహాకవి అన్నట్లు
ఎ చరిత్రలోను ఏముంది
బహుగోప్పగా బౌతికంగా  
చెదలుపట్టి చేరిగిపోయిన కాగితాలు
చిలుముపట్టిన శిల శాసనాలు
శిదిలమైన రాజ్యాల కోటలు
చిరునామాగా మిగిలిన మొండి గోడలు
సైనికుల సమాధులపై ఏర్పడ్డ స్మశానాలు
సమాధులపై పునాదులు వెలిసిన సామ్రాజ్యాలు

ఎ చరిత్ర లోనైనా
స్వార్ధం ఒక్క ప్రాధమిక శక్తి
రాచరికం ఒక్క  వారసత్వపు ఆశక్తి
గెలుపోటములు తరంగాధైర్గ్యలు
చేతులుమరే రాజ్యాలు శక్తి నిత్యత్వ నియమాలు
అధికారం ఆయస్కాంతికరణం
అది అందుకోనెందుకే చేసే ప్రయత్నమే త్వరణం
రాజ్యం ఒక్క కేంద్ర బిందువు
రాజ్య పాలనా పక్రియ ఓ త్రికబిందువు
రాజ్య విస్తరనే కేంద్రక సంలీనం
రాజ్య విమోచానమే కేంద్రక విచ్చిత్తి
రాజి కుదిరితే అనులోమానుపాతం
రాజి చెడితే విలోమనుపాతం
యుద్ధం ఒక్క అణు విస్పోటనం
తట్టుకొని నిలబడితే జడత్వం
తడబడి కూలిపోతే గురుత్వం
మొత్తంగా చరిత్ర
మట్టి పొరల్లో మరుగున పడ్డ నిజం
మూలాలను తవ్వి వెలికి తీయటమే మనిషి నైజం.


                                            రచన
                                     సతీష్ కుమార్ బోట్ల
                                          బొట్లవనపర్తి
                                           కరీంనగర్
                                                   9985960614
                                         Botla1987.mygoal@gmail.com
                                               Botlasjindagi.blogspot.in  
                                               www.Jaitelangana.com 

Friday 26 April 2013

కలాతితమైనదని / సంస్కృతి


తర తరానికి ఆలోచన విదానం మారుతు
అగుపించని ప్రభావానికి లోనవుతూ
ఆధునీకరణ పేరుతో
నవీన నాగరికత నెపం తో
కాలం స్థానబ్రంశం చెందుతూ
 సంస్కృతి రూపాంతరం చేందుతుంది

చీరలు చిరాకు పుట్టిస్తుంటే
జీన్స్ జబర్దాస్ట్ చేస్తుంటే
మాతృ బాష మట్టిలో కలుస్తూ
పరాయి బాష పై పైకి పోతుంటే
సంస్కృతి సమాది అవుతుందని
సంప్రదాయం సచ్చిపోతుందని
గొంతెత్తుతున్నారు  సంస్కృతి ప్రేమికులు
సాంప్రదాయ వదికులకు

 వారికీ పోటిగా
పర్శియులతో ప్రారంబమై
బ్రిటిష్ వారి పాలనా లో పరిపుర్ణమై  
తార తరం లో  పరాయి సంస్కృతిని
నరనరంలో జీర్ణించుకున్నమని
సంస్కృతి సాగరం కాదని
నవీనమై నిరంతరం ప్రవహించే నది అని
మన బాష వేశాలలోనే బహుళత్వం ఉందని
మనం సాంప్రదాయ జడత్వం వదలాలని
గళమేత్తుతున్నా(రు ) నాగరికులు

కానీ
విరేవ్వరు   గ్రహించ లేకపోతున్నారు పాపం
మార్పు అనివార్యం అయినంత మాత్రాన
మన మూలాలు మార్చుకోవలసిన అవసరం లేదని
కొత్తదనం కోరుకున్నంత మాత్రాన
సనతనన్నే సమాది చేయాల్సిన పనిలేదని
నదులేన్ని కోత్తగా పుట్టు కొచ్చిన
అవి సంద్రం లోనే కలవాలిసిందేనని
సముద్రకృతి ని సంతరించుకోవలిసినదేనని
మన సంస్కృతి
కాలం తో కదిలిపోయేది కాదని
కలాతితమైనదని
కోత్త ను ఆహ్వానించాలి కాని
పాతను పాతరేయాకుడదని.

                                  రచన
                            సతీష్ కుమార్ బోట్ల
                               బొట్లవనపర్తి
                                కరీంనగర్
                                     9985960614
                     Botla1987.mygoal@gmail.com
                        Botlasjindagi.blogspot.in
                               www. Jaitelangana.com

Friday 19 April 2013

మిరేవ్వరైన చూసారా?



హిమగిరి శికరాల అంచులో
సౌందర్యపు కాశ్మీరు మంచులో
మిరేవ్వరైన విన్నారా ?
రణరంగమై మ్రోగిన రణధ్వన రోదనలను
తరంగమై ఎగిసిన తరతరాల పోరు కాంక్షను
మిరేవ్వరైన చూసారా?

దవల దత్రికై
దౌత్య అత్రికై
అస్రం తో తడిసిన మంచును
అంగరక్షకుల అణువణువు చీల్చిన తూటాను
మిరేప్పుడైన చూసారా ?
కళేబరాలను సైతం కరిగించే మంచులో
కళేబరాల మాటున ఉన్న మాంసంలో
మరుగుతున్న మాతృభూమి ప్రేమకై
మరణాయుదాల ముందుకు
మరణ శయ్యల పైనకు
ప్రాణాలు విహంగాలై ఎగురుతున్న
పట్టుదలతో తురంగాలై సాగుతున్న
సైనికులను మిరేప్పుడైన చూసారా ?

మిరేప్పుడైన చూసారా ?
ముళ్ళ కంచేలమాటున
బండరాళ్ల చాటున
ఉక్కు దేహమై నిలిచి
పక్కురని చర్మమై వేలిచి
పాశానం ల కనిపిస్తున్న
ప్రతి సైనికుడి హృదయం లోని సున్నిత బావాలను
సుదూరంగా ఉన్న తమవారి స్వప్నాలను

మిరేవ్వరైన చూసారా
కార్గిల్ యుద్దo కోరాల్లో చిక్కి
కష్టం పైకెక్కి కాణాకన మండే ఎర్రని రవ్వలై
నింగికేగిసిన అరుణ వర్ణ సైనిక కిరణాలను
ఆర్తిగా మాతృభూమి ఒడిలో రాలిన కుసుమాలను

మిరేప్పుడైన చూసారా ?
రాజస్తాన్ బోర్డర్ లో
థార్ ఎడారి దారుల్లో
నెత్తురు తో చల్లారిన ఇసుకను
సైనికుల ఆశలతో నిండిన ఒయసిస్సులను
శత్రువులకు చిక్కి చిత్రహింసలు చేయబడ్డ
సైనికుల దేహాలను
చిదిలామైన వారి స్వప్నాలను

మిరేవ్వరైన తాడిచారా ?
తలలు లేని తమవారి దేహాలను చూసి
తల్లడిల్లిన తల్లిదండ్రుల కన్నీళ్ళలో
మిరేవ్వరైన తాడిచారా
వారికోసం కన్నీరైన కార్చారా!
మిరేవ్వరైన పిల్చారా ?
పోరులో సైనికులు చిమ్మిన రుదిరపు వాసనల్ని
తమవారికి సైనికులు పంపిన బసలాని

మిరేవ్వరైన చూసారా?
సైనిక శిబిరాల్లో సర్వం కోల్పోయి
సమస్తం చేజారిపోయి
విరిగిపోయిన కాలానికి చిహ్నంగా
జీవితం తో పోరాటం చేయవలిసిన బలగాలుగా
బ్రతుకు బండి కీళ్ళుడి
భవిష్యతు ఆశల మేడలు కులిపడి
ధైర్యం దైన్యమైన సందర్భాన్ని
మానవత్వం మౌనమైన క్షణాన్ని
మనకోసం ప్రాణాలర్పించినవారిని
ప్రాణం తప్ప ఎం మిగిల్చుకోనివారిని
మిరేవ్వరైన చూసారా
వారికోసం కన్నీరైన కార్చారా
వారికీ సలమైన చేసారా
అసలు వారిని
మేరేవ్వరైన చూసారా ?
( దేశం కోసం మనకోసం ప్రాణాలను పణంగా పెట్ట పోరాడిన పోరాడుతున్న సైనిక వీరులకు సలాం చేస్తూ అంకితమిస్తున్నాను )

జై భారత్              జై జవాన్ .
                                   రచన
                           సతీష్ కుమార్ బోట్ల
                               బొట్లవనపర్తి
                               కరీంనగర్
                                       9985960614
                          Botla1987.mygoal@gmail.com
                               Botlasjindagi.blogspot.in 
                              www.jaitelangana.com