మనిషి సౌఖ్యల కోసం
మనవ తప్పిదాలతో
వన అరణ్యల్లోని కొండల్ని కొల్లగొడుతూ
జన అరణ్యల్ని
కాంక్రీట్ జంగల్ గా మారుస్తూ
పచ్చని ప్రకృతిని పతనం చేస్తూ
రుతువుల గతులను మార్చేస్తూ
లలినో ఎల్నినోలను ఎత్తుకొని
భూగర్భ జలాలను పాతాళం లోకి నెట్టుకొని
కరువు మేఘాలు దూసిన కత్తులకి
నేర్రాలు బారిన నేలను తడపటానికి
ఎంత తవ్విన ఉటతడిలేని కన్నీటి దారాలే
ఎంత వెతికిన నీటి జాడ లేని ఎడారి దారులే
దర్శనమిస్తూ నీటి ఉనికిని నిర్జీవం చేస్తున్నాయి
ప్రాణదారమైన నీటి
వనరులను
నగర నిర్మాణాల క్రింద
సమదిచేస్తూ
వందల మీటర్ల బోరు పైపుల
ద్వార నీటిని లగేస్తూ
మూడు మీటర్ల ఇంకుడు
గుంతలు తవ్వితే ఫలితం ఎం ఉంటుంది
డ్రినేజిల ద్వార సముద్రం లో కలిసిన నీరు
డ్రై అయిన గొంతుకలను
తడుపుతుoదా?
పాతాళం లోకి పడిపోతున్న
నీరు
పగుళ్ళు పారిన నేలను
పచ్చగా మారుస్తుందా?
అందుకే రండి
నానాటికి వట్టిపోతున్న
నీటిని
నేటినుండి రేపటి తరానికి
కానుకివ్వటానికి
అడుగంటిపోతున్న నీటి జాడలు
భవిష్యత్తు తరాలకి
కన్నీటి దారాలు కాకుండా ఉండటానికి
ప్రతి వర్షపు చినుకును
ఒడిసిపట్టుద్దాం
ప్రతి నీటి వనరులను
పునరుద్దరిద్దాం
ప్రతి నీటి బొట్టు
సంరక్షణకు నడుముకట్టుద్దాం
ప్రపంచపు మనుగడకు పట్టం
కట్టుద్దాం
ఒడిసి పట్టే ప్రతి నీటి
బొట్టు
మన ప్రకృతికి పచ్చని
మెట్టు
జారవిడిచే ప్రతి నీటి
బొట్టు
మన బావిష్యత్తు కి కన్నీటి
పెట్టు
రచన
సతీష్ కుమార్ బోట్ల.
అధ్యక్షులు
కరీంనగర్ జిల్లా యువ రచయితల సంఘం
Cell:9985960614
Botlasjindagi.blogspot.in
No comments:
Post a Comment